భారత సైన్యంలో చేరాలనుకునే యువతకు అవకాశం

భారత సైన్యంలో చేరాలనుకునే యువత కోసం ఈ నెల 28 నుంచి సికింద్రాబాద్‌లో ఆర్మీ రిక్రూట్‌మెంట్ ర్యాలీ నిర్వహిస్తున్నట్టు రక్షణశాఖ అధికారులు తెలిపారు.
●125 ఇన్‌ఫ్యాంట్రీ బెటాలియన్(టెరిటోరియల్ ఆర్మీ)లో69
●123లో 10
●మొత్తం 79
వివిధ క్యాటగిరీల్లోని సైనిక ఉద్యోగాల ఖాళీలకు ఎంపిక ప్రక్రియ నిర్వహిస్తున్నట్టు పేర్కొన్నారు. జోన్ 6లో భాగంగా తెలంగాణ, ఏపీ, మహారాష్ట్ర, కేరళ, కర్ణాటక, రాజస్థాన్, తమిళనాడు, గుజరాత్, గోవా రాష్ర్టాల యువత అర్హులని చెప్పారు.
●తెలంగాణ, ఏపీ రాష్ర్టాల అభ్యర్థులకు ఈ నెల 28 ఉదయం 5 గంటల నుంచి హైదరాబాద్, మౌలాలిలోని 1105, రైల్వే ఇంజినీర్ (టెరిటోరియల్ ఆర్మీ) ప్రాంతంలో ఎంపిక ప్రక్రియ నిర్వహించనున్నట్టు చెప్పారు.
●వయస్సు:18 నుంచి 42 ఏండ్ల మధ్య వయసున్న అభ్యర్థులు అర్హులని పేర్కొన్నారు. అదనపు సమాచారం కోసం 125 ఇన్‌ఫ్యాంట్రీ బెటాలియన్, ది గార్డ్స్, తిరుమలగిరి, సికింద్రాబాద్ చిరునామాలో సంప్రదించాలని సూచించారు.