ఆర్మీ పాఠశాలల్లో 8000 టీచర్లు ఉద్యోగాలు

ఆర్మీ వెల్ఫేర్ ఎడ్యుకేషనల్ సొసైటీ (అవేస్) దేశవ్యాప్తంగా ఉన్న ఆర్మీ స్కూళ్లలోని వివిధ విభాగాల్లో ఖాళీగా ఉన్న పీజీటీ, టీజీటీ, పీఆర్‌టీ పోస్టుల భర్తీకి అర్హులైన అభ్యర్థుల నుంచి దరఖాస్తులను ఆహ్వానిస్తున్నది.

మొత్తం పోస్టులు: 8000
●సబ్జెక్టులు: ఇంగ్లిష్, హిందీ, సంస్కృతం, హిస్టరీ, జాగ్రఫీ, ఎకనామిక్స్, పొలిటికల్ సైన్స్, మ్యాథమెటిక్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ, బయాలజీ, బయోటెక్నాలజీ, సైకాలజీ, కామర్స్, కంప్యూటర్ సైన్స్/ఐటీ, హోం సైన్స్, ఫిజికల్ ఎడ్యుకేషన్
◆పోస్టు గ్రాడ్యుయేట్ టీచర్ (పీజీటీ)
◆ట్రెయిన్డ్ గ్రాడ్యుయేట్ టీచర్స్(టీజీటీ)
◆ప్రైమరీ టీచర్ (పీఆర్‌టీ)
●అర్హతలు: సంబంధిత సబ్జెక్టుల్లో కనీసం 50 శాతం మార్కులతో మాస్టర్ డిగ్రీ/పీజీ, బ్యాచిలర్ డిగ్రీలో ఉత్తీర్ణత. బీఈడీ/ రెండేండ్ల డిప్లొమాలో 50 శాతం మార్కులతో ఉత్తీర్ణత. సీటెట్/టెట్, అవేస్ సీఎస్‌బీ ఎగ్జామ్‌లో స్కోర్ ఉన్నవారికి ప్రాధాన్యం ఇస్తారు.
●అర్హత: 40 ఏండ్లకు మించరాదు. (ఢిల్లీ స్కూల్స్ లో టీజీటీ/పీఆర్‌టీకి 29 ఏండ్లు, పీజీటీ 36 ఏండ్లకు మించరాదు). టీచింగ్ రంగంలో ఐదేండ్లపాటు అనుభవం ఉన్నవారు 57 ఏండ్ల వరకు దరఖాస్తు చేసుకోవచ్చు.
◆పరీక్ష కేంద్రాలు: దేశవ్యాప్తంగా హైదరాబాద్‌తోపాటు 70 కేంద్రాల్లో పరీక్ష నిర్వహిస్తారు.
◆ఎంపిక: ఆన్‌లైన్ స్క్రీనింగ్ టెస్ట్, ఇంటర్వ్యూ, స్కిల్‌టెస్ట్ ద్వారా.
●ఆబ్జెక్టివ్ రాతపరీక్షలో టీజీటీ/పీజీటీ-180 మార్కు లు, పీఆర్‌టీ-90 మార్కులకు ఉంటుంది.
●టీజీటీ/పీజీటీ పోస్టులకు.. పార్ట్-1లో జనరల్ అవేర్‌నెస్, మెంటల్ ఎబిలిటీ, ఇంగ్లిష్ కాంప్రహెన్షన్, ఎడ్యుకేషనల్ కాన్సెప్ట్స్ అండ్ మెథడాలజీ సబ్జెక్టుల నుంచి 90 మార్కులు, పార్ట్-2లో సంబంధిత సబ్జెక్టు నుంచి 90 మార్కులు ఇస్తారు.
●పరీక్ష సమయం: మూడు గంటలు.
●పీఆర్‌టీ పోస్టులకు: టీజీటీ/పీజీటీ పోస్టులకు పార్ట్-1లో సూచించిన అంశాల నుంచి 90 మార్కులకు పరీక్ష నిర్వహిస్తారు.
●పరీక్ష సమయం: ఒకటిన్నర గంటలు
●నెగెటివ్ మార్కింగ్: ప్రతి తప్పు సమాధానానికి 1/4 మార్కులను తగ్గిస్తారు
●అప్లికేషన్ ఫీజు: రూ. 500
●దరఖాస్తు: ఆన్‌లైన్‌లో
●చివరితేదీ: అక్టోబర్ 24
●ఆన్‌లైన్ పరీక్షతేదీ: నవంబర్ 17,18
●ఫలితాలు విడుదల: డిసెంబర్ 3
●వెబ్‌సైట్: http://aps-csb.in